సిద్ధిపేట : జిల్లాలోని బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీశ్ రావుకు ఘన స్వాగతం లభించింది. టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో బెజ్జంకి కమాన్ నుంచి బెజ్జంకి వరకు భారీ బైక్ ర్యాలీతో పాటు పుష్పగుచ్ఛాలు అందజేసి మండల ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
కాగా, బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలో మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డప్పు చప్పుళ్లు, బోనాలతో మహిళలు మంత్రికి స్వాగతం పలికారు. నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ మహిళా సమైక్య భవనాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్