అన్ని జాగ్రత్తలు తీసుకొని..వ్యాక్సిన్ వేసుకుని.. కుటుంబ సభ్యులకూ వేయించాలని సీపీ అంజనీకుమార్ నగర పోలీసు సిబ్బందికి సూచించారు. గురువారం ఉన్నతాధికారులతో కలిసి ఆయన నగరంలోని అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి.. కరోనా విపత్కర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తప్పని సరిగా వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా వేయించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు సీపీలు శిఖా గోయెల్, అనిల్కుమార్, స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీ ముత్యంరెడ్డి, ఓఎస్డీ గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.