దేవరుప్పుల, ఏప్రిల్8: మహిళా పొదుపు సంఘాల్లోని సభ్యులంతా ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశలో వారిని ప్రోత్సహించేందుకు అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన డీపీఎం(నాన్ఫాం) బాశిక రాజేంద్రప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల స్థాయి గ్రామైఖ్య సంఘాల వీవోలు, అధ్యక్ష కార్యదర్శులు, వ్యాపారాలపై ఔత్సాహిక మహిళల సమావేశం గురువారం చందన మండల సమాఖ్య అధ్యక్షురాలు రచ్చ స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈసమావేశంతో డీపీఎం మాట్లాడుతూ ప్రభుత్వం ఏటా జిల్లాలో రూ. 250 కోట్ల వ్యయంతో మహిళా సంఘాలకు వివిధ రకాల రుణాలు ఇస్తుండగా మహిళలు తాత్కాలిక పనులకు పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. ఇకపై ఈ రుణాలతో పూర్తి స్థాయిలో వ్యాపారాలు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు. జిల్లాలో 1365 మందిని ఎంపిక చేసి రుణం అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఈనెల 30 వరకు ఆయా లబ్ధిదారుల డీపీఆర్ సమర్పాంచాలని ఏపీఎంలకు ఆయన సూచించారు. ఆగస్టు 15 వరకు ఈ దుకాణాలు నడిచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో ఏపీఎం సురేందర్, సీసీలు సోమనారాయణ, యాకయ్య, వసంత, ఉమ, రామచంద్రం, చందన మండల సమాఖ్య కార్యదర్శి కున్సోతు సుజాత, కోశాధికారి సంధ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
93 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి కేటీఆర్
హనుమంతుని జన్మస్థానం తిరుమలే..ఆధారాలతో నిరూపించనున్న టీటీడీ