హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో అన్నార్తులకు జీహెచ్ఎంసీ అండగా నిలబడుతున్నది. లాక్డౌన్ పరిస్థితుల్లో నిరాశ్రయులు, నిరుపేదలు, పలు దవాఖానల్లోని అటెండెంట్ల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ లక్ష్యానికి మించి 59 వేల ఉచిత భోజనాలను అందిస్తున్నది. హైదరాబాద్లో అన్నపూర్ణ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఐదు రూపాయల భోజనాన్ని ఉచితంగా ఇస్తున్నది. గతంలో ఉన్న 150 కేంద్రాలకు అదనంగా మరో వంద కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటితోపాటు ప్రత్యేక కేంద్రంలో తయారైన భోజనాన్ని బాక్స్లలో పెట్టి ఏఎంహెచ్వోల ద్వారా ఆయా సర్కిళ్లలోని వీధుల్లో తలదాచుకునే వారికి అందజేస్తున్నది. ప్రభుత్వం రోజుకు కనీసం 45 వేల అన్నపూర్ణ భోజనాలను ఉచితంగా అందజేయాలని ఆదేశించగా, గురువారం 50,010 భోజనాలను అందించడం విశేషం.