యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో దళిత బంధు యూనిట్లను, అంగన్వాడీ కేంద్రాన్ని సీఎం ఓ.ఎస్.డి. ప్రియాంక వర్గీస్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్తో కలిసి ఆమె పరిశీలిస్తారు.
అనంతరం గ్రామంలోని రైతు వేదికలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.వాసాల మర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రామ సమగ్రాభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.