హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): బ్రెయిన్డెడ్కు గురైన ఓ మహిళ నుంచి ‘జీవన్ దాన్’ ద్వారా చర్మాన్ని సేకరించి ఉస్మానియా దవాఖానలోని స్కిన్ బ్యాంక్లో భద్రపరిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి చర్మ దానం. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ అపోలో దవాఖానలో ఓ మహిళ బ్రెయిన్డెడ్కు గురైంది. ఆమె అవయవాలతోపాటు చర్మాన్ని దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించడంతో ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు 50 చదరపు సెంటీమీటర్ల చర్మాన్ని సేకరించినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ వెల్లడించారు. దీన్ని స్కిన్ బ్యాంక్లో ఐదేండ్లపాటు నిల్వ చేయవచ్చని, అగ్ని ప్రమాదాల్లో గాయపడినవారికి ఈ చర్మం ఉపయోగపడుతుందని వివరించారు. ఎవరైనా చర్మదానం చేయదల్చుకుంటే 7095911111 టోల్ఫ్రీ నంబర్ ద్వారా ఉస్మానియా స్కిన్ బ్యాంక్ను సంప్రదించాలని సూచించారు. మనిషి చనిపోయిన 6 గంటల్లోగా చర్మాన్ని సేకరించి, భద్రపరచాల్సి ఉంటుందని ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ నిపుణుడు డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు.