కరోనా సెకండ్ వేవ్ ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది ప్రజలకు అండగా ఉంటూ సేవలందిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్ నిబంధనలు, టీకా ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీ, సీహెచ్సీలలో కరోనా నిర్ధారణ పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో పీహెచ్సీలో రోజుకు సుమారు 100 నుంచి 150 మందికి పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి ఉచితంగా మందులను అందిస్తున్నారు. రోజూ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ బాధితుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. మరోవైపు 45ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు.