హైదరాబాద్ : నగరంలోని బాచుపల్లిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు బుకీలను అరెస్టు చేసినట్లు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ. 21 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కోసం ముఠా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు నిఘా పెడుతూ.. బెట్టింగ్లను అరికడుతున్న విషయం తెలిసిందే.