మహబూబ్నగర్ : ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన హన్వాడ మండలం సల్లోనిపల్లి అటవీ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకై ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.
అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు శనివారం మండలంలోని వివిధ ప్రాంతాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు హన్వాడ మండల పరిధిలోకి వచ్చే వెంకటాపూర్ శివారు, హన్వాడ, యారోనిపల్లి, సల్లోనిపల్లి తదితర ప్రాంతాలలో స్థలాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ కు నివేదించగా.. కలెక్టర్ స్వయంగా సల్లోనిపల్లి ప్రాంతంలో ఉన్న 718 సర్వేనెంబర్ లోని భూమిని పరిశీలించారు.
అక్కడ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, అటవీ భూమిని పరిశీలిస్తూ పూర్తిగా ప్రభుత్వ భూమి, అటవీ భూమి ఎంత ఉందో గుర్తించాలని చెప్పారు. అవసరమైతే ఆదివారం నుంచే డిజిటల్ సర్వేను చేపట్టాలని ఇందుకు డిజిటల్ పరికరాలను కొనుగోలు చేయాలని సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ ను ఆదేశించారు.
కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఎఫ్ఓ గంగిరెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎడీ శ్రీనివాస్, హన్వాడ తాసిల్దారు బక్క శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
నల్లగొండ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
ఘరానా దొంగను అరెస్ట్ చేసిన కోరుట్ల పోలీసులు
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం : మంత్రి సత్యవతి
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం