మునిపల్లి/సంగారెడ్డి : మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. లింగంపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం జరిగితే రైతులకు ఏంతో మేలు జరుగుతుందన్నారు. అంతే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు.
లింగంపల్లి గ్రామంలో గల ప్రభుత్వ భూమికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి నివేదిక అందజేయాలని మునిపల్లి రెవెన్యూ అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు.
కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఆర్డీఓ నగేష్, మునిపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, నాయకులు సాయికుమార్, శివశంకర్, ఆనంద్,విఠల్, అఫ్సర్ గోరేమియా తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి