రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): సద్దుల సారే ముస్తాబవుతున్నది. ఆడబిడ్డలు మెచ్చేలా 34 రంగుల్లో, 859 విభిన్న డిజైన్లతో తయారవుతున్నది. బంగారు వర్ణపు జరీ అంచులతో మెరిసిపోతున్నది. యువతుల కోసం ఈ యేడు రూపొందిస్తున్న లంగావోణి చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కోటి చీరల తయారీ లక్ష్యంగా సిరిసిల్లలోని 15 వేల మరమగ్గాలపై తయారుచేస్తున్నారు. పం డుగ దగ్గర పడుతుండటంతో సుమారు 20 వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇప్పటికే 54.87లక్షల చీరలను ప్రాసెసింగ్ చేసి జిల్లాలకు పంపిస్తున్నారు.