రాయ్పూర్: మావోయిస్టులతో ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో జవాన్లు మరణించడం వెనుక ఎలాంటి నిఘా వైఫల్యం లేదని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాగెల్ తెలిపారు. మావోయిస్టుల కదలికలను అడ్డుకునేందుకు ప్రభావిత ప్రాంతాలకు 2 వేల మంది భద్రతా సిబ్బందిని పంపి క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తప్పించుకునే దారి లేక అసహనానికి గురైన మావోయిస్టులు ఈ దాడులకు తెగబడ్డారని అన్నారు. మావోయిస్టుల దాడిలో గాయపడి రాయ్పూర్లోని రామ్కృష్ణ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భద్రతా సిబ్బందిని బాగెల్ పరామర్శించారు. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు.