సంగారెడ్డి : జిల్లాలోని పుల్కల్ మండలం బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు 5,6, నెంబర్ గేట్లను రెండు మీటర్లు పైకెత్తి 24,126 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేశారు. దీంతో సింగూరు ప్రాజెక్టు దిగువన మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు.