హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సింగరేణి ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన యూ ట్యూబ్ చానెల్ సింగరేణి సైరన్లో సింగరేణి ముచ్చట్లు కార్యక్రమం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. తొలిరోజు డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్ బలరామ్తో ప్రజాకవి జయరాజ్ ముఖాముఖి నిర్వహించారు. సింగరేణీయులు అందరూ సింగరేణి సైరన్ను సబ్స్ర్కైబ్ చేసుకోవాలని ముఖ్య ప్రజా సంబంధా ల అధికారి, మారెటింగ్, కో ఆర్డినేషన్ జీఎం సూర్యనారాయణ సూచించారు. త్వరలో డైరెక్టర్లు చంద్రశేఖర్, సత్యనారాయణరా వు, మైనింగ్ అడ్వైజర్ డీఎం ప్రసాద్, వివిధ విభాగాల అధిపతులతో ముఖాముఖి ప్రసారం కానుందని చెప్పారు. మధుర జ్ఞాపకాల పేరిట 130 ఏండ్ల నుంచి సింగరేణిలో జరిగిన ప్రముఖ ఘట్టాలు, పరిణామ క్రమాలను పాతతరం ప్రముఖులు పంచుకునేలా కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.