న్యూఢిల్లీ: ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), న్యూఢిల్లీలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, ఫీల్డ్ వర్కర్, ఫీల్డ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 14 వరకు అందుబాటులో ఉండనున్నాయి.
మొత్తం పోస్టులు: 14
ఇందులో స్టాఫ్నర్స్ 5, ఫీల్డ్ వర్కర్ 4, ఫీల్డ్ అటెండెంట్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: నర్సింగ్లో డిప్లొమా లేదా మిడ్వైఫరీ (జీఎన్ఎం) చేసి ఉండాలి. మిగిలిన పోస్టులకు పదో తరగతితోపాటు సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పాసై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.
ఈ-మెయిల్: arikablb@gmail.com
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14
వెబ్సైట్: aiims.edu