సింగరేణిలో 372 పోస్టులు

- నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
- తుది గడువు ఫిబ్రవరి 4
- ఇంటర్వ్యూలు ఉండవు: సీఎండీ
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ)/ కొత్తగూడెం సింగరేణి: సింగరేణిలో కొలువుల జాతర మొ దలయింది. మొదటివిడుతగా 372 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలయింది. సింగరేణిలో 651 పోస్టులను మార్చిలోపల భర్తీచేస్తామని సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రకటించిన రెండు వారాల్లోనే మొదటివిడుత భర్తీకి నోటిఫికేషన్ రావడం గమనార్హం. మిగతా పోస్టులకు దశలవారీగా నోటిఫికేషన్లను విడుదలచేస్తామని సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. తాజా నోటిఫికేషన్లో 7 క్యాటగిరీల్లో 372 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో 305 పోస్టులను లోకల్.. అంటే సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మానికి చెందిన అభ్యర్థులకు కేటాయించారు. అన్ రిజర్వ్డ్గా కేటాయించిన 67 పోస్టులకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలవారు అర్హులే. పూర్తి సమాచారం కోసం www. scclmines. com ను సంప్రదించాలి. అర్హులైన అభ్యర్థులు శుక్రవారం మధ్యా హ్నం 3 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయం త్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సంస్థ తెలిపింది. దరఖాస్తుతోపాటు అర్హతల సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని పేర్కొన్నది. ఎవరూ హార్డ్కాపీలను పంపించవద్దని స్పష్టంచేసింది. దరఖాస్తు సమయంలోనే ఎస్బీఐ లింకు ద్వారా రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 30 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో ఐదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.
పైరవీలంటే నమ్మొద్దుసీఎండీ ఎన్.శ్రీధర్
ఉద్యోగాల నియామకం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని యువతకు సువర్ణ అవకాశమని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. రాత పరీక్ష ద్వారానే ఎంపిక ఉంటుందని, ఇంటర్వ్యూ లు ఉండవని చెప్పారు. పైరవీలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే నమ్మవద్దన్నారు. ఎవరైనా ప్రలోభపెడితే సింగరేణి విజిలెన్స్ విభాగానికి తెలియజేయాలన్నారు.
తాజావార్తలు
- భయపెడుతున్న భానుడి భగభగలు
- అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!
- మరోసారి బుల్లితెరపై సందడికి సిద్ధమైన రానా..!
- ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
- పొట్టేళ్ల పందెం పోటీలు.. మూడు రాష్ర్టాల నుంచి 22 జీవాలు రాక
- శివుడి సాక్షిగా అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్
- చదివింది 'పది'.. వ్యాపారం 'కోటి'..
- ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
- అబద్ధాల బీజేపీ ఆరేండ్లుగా ఏం చేసింది?