హైదరాబాద్ : సింగరేణి కోల్మైన్స్ బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య గులాబీ గూటికి చేరారు. తన అనుచరులతో కలిసి మల్లయ్య టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కెంగర్ల మల్లయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లయ్యకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ వెంకటేష్ నేతతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.