సిద్దిపేట క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో మెరవాలి

సిద్దిపేట : జిల్లాలోని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని విభిన్న రంగాల క్రీడాకారులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మినీ గ్రౌండ్ లో బుధవారం సాయంత్రం అండర్-14, అండర్-19 ఫుట్ బాల్ క్రీడల కోసం శిక్షణ తరగతులు పొందుతున్న క్రీడాకారులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. అంతకు ముందు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి కబడ్డీ క్రీడా పోటీల కోసం ఏర్పాటు చేసిన లాంగ్ టర్మ్ శిక్షణ శిబిరాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..జిల్లాలోని కబడ్డీ, ఫుట్ బాల్ క్రీడాకారులు ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శివకుమార్, ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధి అక్బర్ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- భారత రాజకీయ చరిత్రలో ఆయనదో పేజీ..
- చుక్కలు చూపించిన శార్దూల్, సుందర్.. టీమిండియా 336 ఆలౌట్
- కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు షురూ..
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
- ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
- బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
- ఆచార్యలో ‘సిద్ధ’గా రాంచరణ్.. లుక్ రివీల్
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్