వెద పద్ధతిలో సాగు పరిశీలన

- కొండపల్కలను సందర్శించిన సిద్దిపేట రైతులు
మానకొండూర్ రూరల్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామంలో చేపట్టిన వెద పద్ధతిలో వరి సాగును సిద్ధిపేట రైతులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వెదజల్లుతూ వరి సాగుచేసి మంచి ఫలితాలు సాధించి ఉత్తమ మహిళా రైతుగా నిలిచిన గ్రామానికి చెందిన రూపురెడ్డి లక్ష్మి వీరికి సాగు విధానంపై అవగాహన కల్పించారు. విత్తనాలు చల్లే విధానం, ఒడ్లలో మల్చింగ్ చేయడం, జంబు కొట్టడం, వర్మి కంపోస్ట్ సేకరణ, సేంద్రియ, రసాయన ఎరువుల వాడకంతో పాటు కూలీల సంఖ్యను అధిగమించడం వంటి అంశాలపై లక్ష్మీ-తిరుపతిరెడ్డి దంపతులు స్వయంగా పని చేస్తూ వివరించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఏవో మాట్లాడుతూ.. ఈ పద్ధతిలో కూలీల సంఖ్యను అధిగమించవచ్చని, పెట్టుబడి తక్కువ-దిగుబడి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ వంగ నాగిరెడ్డి, ఏవో పరశురాంరెడ్డి, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్న కోడూర్ మండలాల్లోని దాదాపు 200 మంది రైతులు, వ్యవసాయ అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు సందర్శించారు.
తాజావార్తలు
- చిరంజీవి మెగా ప్లానింగ్..ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి