న్యూఢిల్లీ: టీవీఎస్ మోటర్ కంపెనీ రైడింగ్ మోడ్స్తో కూడిన సరికొత్త అపాచీ ఆర్టీఆర్-200 4వీ సింగిల్ ఛానల్ ఏబీఎస్ బైక్ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ ఈ రైడింగ్ మోడ్స్ అపాచీ ఆర్టీఆర్ 4వీ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్కు మాత్రమే పరిమితమై ఉండేవి. తాజాగా తీసుకొచ్చిన సింగిల్ ఛానల్ ఏబీఎస్ మోడల్లో స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్తో పాటు అడ్జెస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్, అడ్జెస్టబుల్ లివర్స్ను కూడా పొందుపర్చడం విశేషం. రూ.1,28,020 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరకు ఈ బైక్ లభ్యమవుతుంది.