హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బాధితులకు సహాయార్ధం సౌత్ ఇండియా సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను గురువారం ప్రభుత్వానికి అందజేసింది. వీటిని సిక్మా ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం రవీందర్రెడ్డి, సాగర్ సిమెంట్స్ ఎండి డాక్టర్ ఎస్ ఆనంద్రెడ్డి, సిక్మా సీఈవో గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న స్పిరిట్ ఆఫ్ అమెరికా సంస్థ 43 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను తెలంగాణకు విరాళంగా అందజేసింది. వీటిని రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేటలోని ఆరోగ్య కేంద్రాలకు ఇచ్చినట్టు స్పిరిట్ ఆఫ్ అమెరికా సీఈవో జిమ్హాక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ సహాయక చర్యల్లో భాగంగా అత్యవసర సహాయంగా 320 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను దేశంలోని కమ్యూనిటీ సెంటర్లు, జిల్లా ఆరోగ్య కేంద్రాలకు అందజేయాలని ఈ సంస్థ నిర్ణయించింది.