యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భువనగిరి అడ్డగూడూర్ లాకప్ డెత్ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చర్యలు చేపట్టారు. ఎస్ఐ మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజులక్రితం లాకప్లో మరియమ్మ’45) అనే మహిళ మరణించింది. విచారణలో ఎస్ఐ, కానిస్టేబుళ్ల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తేలింది. దీంతో బాధ్యులను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు వెలువరించారు. మల్కాజ్గిరి ఏసీపీని దర్యాప్తు అధికారిగా సీపీ నియమించారు. లాకప్డెత్ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.