యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు అనుబంధ శివాలయంలో నూతనంగా ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభాలకు ఆలయ అర్చకులు శనివారం శుద్ధి పూజలు చేశారు. గర్భాలయ ముఖ మండపంలో ధ్వజస్తంభం కర్రలు, బంగారు కలశాలు, తొడుగులకు సంప్రోక్షణ చేశారు. అనంతరం యంత్రాల ద్వారా లడ్డూ తయారీ ట్రయల్ రన్ నిర్వహించారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఈవో గీత కొత్త యంత్రాలను ప్రారంభించి, పరిశీలించారు.
–యాదాద్రి