మాడ్గులపల్లి, మార్చి 30 : టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను అఖండ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు కృషిచేయాలని ఉప ఎన్నిక మండల ఇన్చార్జి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అభంగాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో నంబర్వన్గా నిలిచాయని అన్నారు. ఇతర రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. సాగర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని, మరింత అభివృద్ధి జరుగాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. రైతుబంధు దేశంలో అతి పెద్ద పథకమని, ఇప్పటికి సాగర్లో 97వేల మంది రైతులు రూ.764 కోట్లు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. ఏడేండ్లలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యపై నియోజకవర్గ ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలు భగత్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. టీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పగిడిపల్లి రామచంద్రమ్మ, నాయకులు గంగాధర్, కడియం సైదులు, అర్జున్రెడ్డి, ఖాసీం, కుక్కమూడి నర్సింహ పాల్గొన్నారు.