హైదరాబాద్ : ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ మృతి పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల విధ్వంసానికి వ్యతిరేకంగా చిప్కో ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జీవితాంతం కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు సుందర్ లాల్ బహుగుణ చేసిన కృషిని ప్రజలు ఎప్పటికి మరిచిపోరని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత