ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
వరంగల్, ఏప్రిల్ 11: సామాజిక తత్వవేత్త, విద్యావేత్త జ్యోతిరావు పూలేకు భారత రత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని వరంగల్లోని ములుగు రోడ్డు జంక్షన్లోగల పూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్న సమయంలో పూలేకు భారత రత్న ప్రకటించాలని పార్లమెంట్లో గళమెత్తినట్టు తెలిపారు. పూలే ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి తదితరులు పాల్గొని పూలే విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.