శంషాబాద్, జూలై 12; తన రెండో దశ ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించడంతో క్లీన్ ఎనర్జీ దిశగా శంషాబాద్ ఎయిర్ పోర్టు మరో మైలురాయని చేరుకుంది. ఎయిర్ పోర్టు మొత్తం సోలార్ విద్యుత్ సామర్ధ్యం 10 మెగావాట్లకు పెరిగిందని సోమవారం జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు తెలిపారు. 2015లో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించారు. 10 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి 45 ఎకరాల విస్తీర్ణంలో 30 వేలకు పైగా సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేశారు. సోలార్ ప్లాంట్ కారణంగా ఎయిర్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బోర్డు నుంచి కొంటున్న విద్యుత్లో ఏడాదికి 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ తగ్గుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ ఎయిర్ పోర్టు హరిత, పునరుత్పాదక ఇంధనానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఏసీఐ (విమానాశ్రయ కౌన్సిల్ ఇంటర్నేషనల్) సభ్య విమానాశ్రయంగా 2050 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అన్ని విధాల కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.