హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, విశ్వవిద్యాలయాల్లో మహిళా సిబ్బంది సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున షీ టాయిలెట్లను నిర్మించనున్నది. పోలీస్ స్టేషన్లలో నిర్మాణానికి రూ.20 కోట్లు, యూనివర్సిటీల్లో ఏర్పాటుకు రూ.10 కోట్లు మొత్తం కలిపి బడ్జెట్లో రూ.30 కోట్లు కేటాయించింది. అన్ని పోలీస్ స్టేషన్లతోపాటు ఉస్మానియా, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, కాకతీయ, తెలంగాణ, తెలుగు యూనివర్సిటీ, జేఎన్ఏఎఫ్ఏయూల్లో షీ టాయిలెట్లను నిర్మించనున్నారు. ఇదివరకు పట్టణ ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే షీ టాయిలెట్లను ఏర్పాటుచేసేవారు. కొత్తగా వీటి ఏర్పాటుతో స్టేషన్లలోని మహిళా సిబ్బందితోపాటు వర్సిటీల్లో సిబ్బంది, విద్యార్థినుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.