కొండాపూర్, సెప్టెంబర్ 8: పర్యావరణ పరిరక్షణక భవిష్యత్తు తరాల కోసం ఎంతో అవసరమని, అందువల్ల ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిధరూర్ పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న పార్లమెంటరీ స్థాయీ సంఘం బుధవారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొంది. ఎంపీ రంజిత్రెడ్డి, కమిటీ ప్రతినిధులతో కలిసి శశిథరూర్ మాదాపూర్లోని శిల్పారామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మొక్కలునాటే కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతున్నదని ఎంపీ రంజిత్రెడ్డి తనతో అన్నారని, తమవంతుగా కూడా మొక్కలు నాటుదామని కోరారని చెప్పారు. తమ కమిటీలోని వివిధ పార్టీలకు ఎంపీలందరూ హైదరాబాద్ పచ్చదనం కోసం తద్వారా దేశంలో పచ్చదనం కోసం తమవంతుగా మొక్క లు నాటామని తెలిపారు. పర్యావరణ హితం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ను చేపట్టిన ఎంపీ సంతోష్కుమార్ను అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాలను పార్లమెంటరీ బృందానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు మహువ మొయితర, ఎంపీలు నరేంద్ర జాదవ్, సుమతి తమిజిచ్చీ తంగపాండియన్, ధైర్యశీల్ శంభాజీరావు మానే, శక్తిసింహ్ గోహిల్, నదిముల్ హాక్, పీఆర్ నటరాజన్, సంతోష్ పాండే, శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య పాల్గొన్నారు.