నమస్తే తెలంగాణ యంత్రాగం, మార్చి 23 : భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వర్ధంతి సందర్భంగా ‘షహీద్ దివస్’ను జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముగ్గురు వీరులకు నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ, ఐఎఫ్టీయూ, పీవైఎల్ ఆధ్వర్యంలో దేవీరోడ్డు చౌరస్తాలోని భగత్సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశభక్తి అంటూ మాటలు చెబుతూ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను వీరులు భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు పోరాట స్ఫూర్తితో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజాసంఘాల నాయకులు ప్రశాంత్, జలంధర్, విఠల్, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. అర్సపల్లిలోని భగత్సింగ్ విగ్రహానికి ఏఐపీఎస్యూ నాయకులు నివాళులు అర్పించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల తదితరులు పాల్గొన్నారు. నగరంలోని భగత్సింగ్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్, డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో పీడీఎస్యూ నాయకులు, వర్నిలో సీపీఎం నాయకులు, మోపాల్లో రైతుకూలీ సంఘం నాయకులు, రుద్రూర్లో పతంజలి యోగా సమితి ప్రతినిధులు, సత్యశోధక్ పాఠశాలలో ప్రిన్సిపాల్ నర్సయ్య వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి పరుచూరి శ్రీధర్ భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. న్యాయవాదులు మాణిక్రాజ్, ఆశనారాయణ, జగన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నందిపేట్లో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో భగత్సింగ్ వర్ధంతిని నిర్వహించారు. ప్రధానకూడలి వద్ద భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
మాక్లూర్ మండలంలోని మానిక్బండార్, బోర్గాం(కే) గ్రామాల్లో భగత్సింగ్ వర్ధంతిని పీవైఎల్, సీపీఐఎంఎల్ నాయకులు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో భగత్సింగ్ వర్ధంతిని టీఆర్ఎస్, బీజేపీ, పీవైఎల్, ఏఐకేఎంఎస్ నాయకులు నిర్వహించారు. ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో, మండలంలోని కోమన్పల్లిలో టీఆర్ఎస్ యువజన నాయకుల ఆధ్వర్యంలో, ఆర్మూర్లో పీవైఎల్, ఏఐకేఎంఎస్, పీడీఎస్యూ, ఏఐపీఎస్యూ ఆధ్వర్యంలో భగత్సింగ్ వర్ధంతిని నిర్వహించారు. నవీపేటలో భగత్సింగ్ వర్ధంతిని జన వికాస సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి ఆధ్వర్యంలో నిర్వహించారు. బోధన్ పట్టణంలో మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.