వీణవంక, ఆగస్టు 15 : హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్కు చెందిన శాలివాహన (కుమ్మరి) సంఘం టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మాన ప్రతిని ఆ సంఘం నాయకులు ఆదివారం వీణవంకలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం తామంతా ఏకతాటిపైకి వచ్చామన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి బాగుందని, మరింత అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెలువాలని పూర్తి మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నల్ల మమత, ఉప సర్పంచ్ గెల్లు రమేశ్, వార్డు సభ్యులు భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు బాబురావు, శాలివాహన సంఘం అధ్యక్షుడు సిలివేరు సమ్మయ్య, నాయకులు మ్యాక వీరయ్య, రాజవీరు, నర్సింగరావు, ఈదునూరి కుమార్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.