హైదరాబాద్ : టి-సాట్ సీఈవో (టి.సాట్-సాఫ్ట్ నెట్) టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి శుక్రవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయ ఆవరణలో రెండు మామిడి మొక్కలతో పాటు, ఏడాకుల మొక్కలను సిబ్బందితో కలిసి నాటారు. ఈ సందర్భంగా శైలేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాల క్రితం కార్యాలయ ఆవరణ అంతా ఏడారిగా ఉండేదన్నారు.
ప్రస్తుతం పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిందన్నారు. నగరంలో పొల్యూషన్ ప్రభావాన్ని ఎదుర్కొని టి-సాట్ కార్యాలయానికి వచ్చి ఆరోగ్యవంతమైన ఆక్సిజన్ పొందడంతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించవచ్చని గుర్తు చేశారు. ఈ పచ్చదనాన్ని ఇలాగే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
జూలై మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా మంత్రి కేటీఆర్ టి-సాట్ కార్యాలయంలో నిండిన పచ్చదనం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మంత్రి స్ఫూర్తితో నా పుట్టిన రోజు సందర్భంగా మరో మూడు మొక్కలు నాటాను. అలాగే పచ్చదనం కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండేందుకు మనవంతు ప్రయత్నం చేద్దామని పిలుపు నిచ్చారు.
ఇవి కూడా చదవండి..
పసిబిడ్డను పొట్టనబెట్టుకున్న అమ్మమ్మ
డ్రైవర్ లేకుండానే నడిచిన ట్రాక్టర్.. వీడియో
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
ఆ పథకాలన్నీ గత బడ్జెట్లోనివే : గుత్తా సుఖేందర్ రెడ్డి
Rashmi Gautam: లంగా ఓణీలో హీటెక్కిస్తున్న యాంకర్ రష్మీ