హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలు నియామకమయ్యారు. సెప్టెంబర్ 16న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ సుమలత, జస్టిస్ రాధారాణి, జస్టిస్ మాధవిదేవి, జస్టిస్ తుకారామ్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డిని నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఒడిశా హైకోర్టుకు సైతం ఇద్దరు జడ్జిలను, కేరళ హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలని నియమిస్తూ న్యాయశాఖ నోటిషికేషన్ విడుదల చేసింది.