హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయాధికారుల కోటాలో ఏడుగురి పేర్లను సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. హైకోర్టు జడ్జిగా జస్టిస్ పి. శ్రీ సుధ, జస్టిస్ సి. సుమలత, జస్టిస్ జి. రాధారాణి, జస్టిస్ ఎం. లక్ష్మణ్, జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ ఎం. వెంకటేశ్వర రెడ్డి, జస్టిస్ మాధవీ దేవి పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ ఇటీవల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.