అమరావతి : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరగల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోనుకారు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శనివారం తిరుమల రెండవ కనుమదారి ఎగువ ఘాట్ రోడ్డులో మలుపు వద్ద కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో నెల్లూరుకు చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి వద్ద పొగమంచు కారణంగా రెండు ట్రాక్టర్లు బోల్తా పడగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.