అహ్మదాబాద్ : ఓ 23 ఏండ్ల యువకుడు క్రూర మృగంలా ప్రవర్తించాడు. మ్యారేజ్ ప్రపోజల్కు నిరాకరించిన 16 ఏండ్ల బాలికపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన గుజరాత్లోని రాజ్కోట్లోని జేటాల్సర్ గ్రామంలో ఈ నెల 17న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 12వ తరగతి చదువుతున్న ఓ బాలిక.. తన సోదరుడితో కలిసి ఇంట్లో ఉండగా.. జయేశ్ అనే యువకుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ బాలిక ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి.. 32 సార్లు కత్తితో పొడిచాడు. ఈ దాడిలో బాలిక సోదరుడు కూడా గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన బాలిక మరణించింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు జయేశ్ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి నిరాకరించడంతోనే కత్తితో దాడి చేశానని జయేశ్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. నిందితుడికి కఠిన శిక్ష అమలు చేయాలని మృతురాలి తండ్రితో పాటు పలువురు నాయకులు డిమాండ్ చేశారు.