వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 30: రాష్ట్రంలో వైద్య సేవల విస్తరణలో మరో ముందడుగు పడింది. కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సాధారణ వైద్యసేవలను అధికారులు శుక్రవారం ప్రారంభించారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొవిడ్ విభాగాన్ని విస్తరించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా అత్యవసర, సూపర్స్పెషాలిటీ వైద్యసేవలను కేఎంసీ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు. మూత్రపిండ వ్యా ధుల చికిత్సకు ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటుచేశారు. 50 పడకలను సిద్ధంచేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సామ ర్థ్యం మేరకు సేవలను విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎంజీఎంలో యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యసేవలు వినియోగించుకోవడానికి వచ్చిన రోగులను, బా ధితులను ప్రత్యేక అంబులెన్స్లో కేఎంసీ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో సేవలు అందుతున్న తీరును ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి పరిశీలించారు.