హైదరాబాద్: రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగిసిపోయింది. అయితే, పోలింగ్ సమయం ముగిసేటప్పటికి ఇంకా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసేసరికి రెండు స్థానాల్లోనూ పోలింగ్ 50 శాతానికి మించే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని వారు చెబుతున్నారు.