హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీఎంఓలో చోటు దక్కింది. రాహుల్ బొజ్జాను సీఎంఓలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్ బొజ్జాను సీఎంఓలోకి తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ నిన్న హుజూరాబాద్ మండలం శాలపల్లిలో జరిగిన దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు. ఈ మేరకు వెనువెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగానూ రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దళితబంధు పథక పర్యవేక్షణలో రాహుల్ బొజ్జా సేవలను వినియోగించుకోనున్నట్లు సీఎం తెలిపిన విషయం తెలిసిందే.