హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్ టౌన్: బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణభవన్లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన అనుచరులు, కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. గురువారం ఆయన హుజూరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఉప ఎన్నికలో ప్రజలు బావోద్వేగాలకు గురికావొద్దని, విజ్ఞతతో ఓటేయాలని కోరారు. నిరుపేద దళితుల, దేవాలయ భూములను ఆక్రమించి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ను బీజేపీలో చేర్చుకోవటాన్ని నిరసిస్తూ, ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.