ఖమ్మం: సెల్ఫీ సరదా యువకుడి ప్రాణం తీసింది. మిత్రులతో కలిసి నాటుపడవలో చెరువులో దిగిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్లలో వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న చెరువులో ఒక నాటుపడవ ఉంది.
వెంకటకృష్ణ (19) అనే యువకుడు తన ఇద్దరు మిత్రులతో కలిసి ఆ పడవలో చెరువులోకి వెళ్లాడు. అనంతరం సెల్ఫీ తీసుకునేందుకు మిత్రులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురూ నీటిలో పడిపోయారు. కాసేపటికి వెంకటకృష్ణ మిత్రులిద్దరూ క్షేమంగా ఒడ్డుకు చేరారు. కానీ వెంకటకృష్ణ మాత్రం నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు.