కరీంనగర్ : దేశాన్ని నాశనం చేసే పార్టీలో ఈటల రాజేందర్ చేరాడని, ఆత్మరక్షణ కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవం అంటున్న ఈటల ఢిల్లీలో మోకరిల్లాడని, పార్టీ కండువా ఒక అనామకుడి చేత కప్పించుకున్నాడని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నో పదవులు అందించి, గౌరవించిన టీఆర్ఎస్ను వీడి పెద్ద తప్పు చేశాడని, బీజేపీలో చేరేందుకు వెళ్లి అవమాన పడ్డారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, ప్రజల ఉసురు పోసుకుంటున్న పార్టీలో ఎలా చేరుతావని అన్నారు. కరోనా సమయంలో టీకాలపై వ్యాపారం చేసే పార్టీ బీజేపీ అని, ఆ పార్టీలో చేరడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, ప్రగతి భవన్ బానిసల భవనం కాదని, ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న భవనమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న పార్టీకి ఇక్కడ స్థానం ఉండదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వెంట ఉండేందుకే ఇష్ట పడుతున్నారని తెలిపారు. పార్టీకి ద్రోహం చేసిన నీకు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని తెలిపారు.
సమావేశాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, జడ్పీ అధ్యక్షురాలు విజయ, సుడా చైర్మన్ జీవీ, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, జడ్పీటీసీ శ్యాం ఎంపీపీ మమత, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే