హైదరాబాద్ : మరోసారి విరుచుకు పడుతున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని, స్వీయ జాగ్రత్తలే ఇందుకు శ్రీరామ రక్ష అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తాజా పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించటంపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ప్రాణం విలువైనదని, ఎలాంటి అజాగ్రత్తలకు చోటివ్వకుండా కరోనా నియమాలను పాటించాలన్నారు. ప్రతి పౌరుడు, ఉద్యోగులు ప్రభుత్వ సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని మంత్రి చెప్పారు. మంత్రి సూచనల మేరకు అరణ్య భవన్ లో ప్రత్యేకంగా కొవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించినట్లు పీసీసీఎఫ్ వెల్లడించారు.
ప్రతి ఉద్యోగి వాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖతో సమస్వయం ద్వారా అన్ని జిల్లాల్లో క్షేత్ర స్థాయి సిబ్బందికి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నామని పీసీసీఎఫ్ వెల్లడించారు.
అరణ్య భవన్ లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ లో శోభ స్వయంగా దగ్గర ఉండి, ఉద్యోగులు అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించారు. హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్, డీఎఫ్ఓ జోజి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇవి కూడా చదవండి..
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?