శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం రియాద్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణీకుల వద్ద స్మగ్లింగ్ బంగారం స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి ఎస్వీ3896 విమానంలో వచ్చిన ముగ్గురు ప్రయాణీ కులపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు.
ఆ ప్రయాణీకులు తమ బ్యాగులు, ప్యాంట్లలో బంగారు గాజులను దాచి స్మగ్లింగ్కు విఫలయత్నం చేశారు. కానీ కస్టమ్స్ తనిఖీలో పట్టుబడ్డారు. వారినుంచి రూ. 34.03 లక్షల విలువ చేసే 735.45 గ్రాముల బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.