దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారిక స్పాన్సర్గా డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ అయిన భారత్పే మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2023 వరకూ ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. ఒప్పందంలో భాగంగా బ్రాడ్కాస్ట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్పై ఈ అసోసియేషన్ను భారత్పే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడేళ్ల కాలంలో ఎన్నో ముఖ్యమైన ఐసీసీ ఈవెంట్లు జరగనున్నాయి. కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తోపాటు మెన్స్ టీ20 వరల్డ్కప్ (2021), మెన్స్ టీ20 వరల్డ్కప్ (2022), వుమెన్స్ వరల్డ్కప్ (2022), అండర్-19 క్రికెట్ వరల్డ్కప్ (2022), వుమెన్స్ టీ20 వరల్డ్కప్ (2022), మెన్స్ వన్డే వరల్డ్కప్ (2023), వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (2023) జరగనున్నాయి. క్రికెట్ అభిమానులతో ఎప్పటికప్పుడు ఎంగేజ్ అవుతూ ప్రచారాలు కూడా భారత్పే నిర్వహించనుంది.
భారత్పే ఇప్పటికే క్రికెట్లో తన బ్రాండ్ను ప్రమోట్ చేసుకుంటోంది. 11 మంది క్రికెటర్లు భారత్పే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, బుమ్రా, కేఎల్ రాహుల్, షమి, జడేజా, రైనా, శ్రేయస్ అయ్యర్, పృథ్విషా, సంజు శాంసన్, చాహల్, శుభ్మన్ గిల్ భారత్పేతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇండియాలో 2018లో అశ్నీర్ గ్రోవర్, శాశ్వత్ నక్రానీలు ప్రారంభించిన భారత్పేకు 100 నగరాల్లో 60 లక్షల మర్చంట్లు ఉన్నారు.