ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై దర్శనం ఇవ్వబోతున్నాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ.. మళ్లీ బుల్లితెరపై తన విశ్వరూపం చూపించబోతున్నాడు. ఈయనకు బుల్లితెర కొత్తేం కాదు.. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ‘బిగ్ బాస్ సీజన్ 1’ హోస్ట్ చేశాడు. అది కాస్తా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు జూనియర్. ఇన్నేళ్లకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ వచ్చేస్తున్నాడు తారక్. నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్నే కాస్త మార్చి ఇది తీసుకొస్తున్నారు.
తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. జెమిని ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో ఏప్రిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ బాగా ప్రజాదరణ పొందడంతో దాన్ని కాస్త మార్చి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ తీసుకొస్తున్నారు. మార్చిలోనే ఈ షోకి సంబంధించి ఎంట్రీస్ తీసుకుంటారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగానే జరుగుతుంది. తన సినిమాలతో పాటు ఈ షోకు కూడా డేట్స్ ఇచ్చేశాడు జూనియర్.
ఒక్కో ఎపిసోడ్ కోసం కోటికి పైగానే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు తారక్. కరోనా కారణంగా గతేడాదే మొదలవ్వాల్సిన ఈ షో ఇప్పుడు బయటికి వస్తుంది. సీజన్ 1 నుంచి దాదాపు రూ.30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు జూనియర్. ఎంటర్టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ షోను ఎంతవరకు సక్సెస్ చేస్తాడో చూడాలిక.