కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ను బీజేపీలో చేర్చుకోవడంపై పునరాలోచించుకోవాలని ఈటల దళిత బాధితుల సంఘం నియెజకవర్గ అధ్యక్షుడు తిప్పారపు సంపత్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు వినతిపత్రం అందజేశారు. సోమమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని ఆయన కలిశారు.
ఈటల రాజేందర్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని చాలా మంది దళితులను అక్రమంగా జైలుకు పంపించాడని గుర్తు చేశారు.
2018 ఎన్నికల్లో ఈటల అక్రమాస్తులపై ప్రశ్నించిన తనపై పీడీయాక్టు పెటించారని వివరించారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని, లేని పక్షంలో దళితులు బీజేపీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నమిండ్ల రాజేశ్వర్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వేటగాళ్లను పట్టించిన కెమెరా ట్రాప్లు
ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికిన తెల్ల బంగారం
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన