హైదరాబాద్: గులాబ్ తుఫాను వల్ల దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతోపాటో మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఒడిశా వైపు నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే 13 రైళ్లను రద్దు చేయగా, మరో 16 రైళ్లను దారిమళ్లించింది. వీటిలో నేడు బయలుదేరాల్సిన కేఎస్ఆర్ బెంగళూరు సిటీ-భువనేశ్వర్, యశ్వంత్పుర్-బెంగళూరు, తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్-పూరీ ఎక్స్ప్రెస్, హెచ్ఎస్ నాందేడ్-సంబాల్పూర్ ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్-ముంబయి ఎల్టీటీ రైళ్లు ఉన్నాయి.