ఎంపీ సంతోష్కుమార్ పెద్ద మనుసు
కరీంనగర్లో నిత్యం 250 మందికి అన్నదానం
విద్యానగర్, మే 24 : అన్నార్తుల ఆకలి తీరుస్తూ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పెద్ద మనసు చాటుకున్నారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలు, పేదల కోసం అన్నదాన కార్యక్రమంతో అండగా నిలుస్తున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమానికి శ్రీకారంచుట్టి నిత్యం 250 మందికి భోజనం పెడుతున్నారు. సోమవారం అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతుకూలీలకు భోజనం వడ్డించారు. అన్నదానం కోసం వ్యవసాయ మార్కెట్ ప్రాంతం ఎంచుకోవడం మంచి నిర్ణయమని అభినందించారు. నిత్యం భోజనం పెట్టి తమ కడుపులు నింపుతున్న ఎంపీ సంతోష్కుమార్కు రైతు కూలీలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య తదితరులు ఉన్నారు.