రాష్ట్రంలో తెరచుకోనున్న స్కూళ్లు!

హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉన్నది. రెండు మూడు వారాల్లో రెగ్యులర్ తరగతులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. సర్కారు అనుమతిస్తే తరగతులు ప్రారంభిస్తారు. స్థానిక సంస్థల సహకారంతో స్కూళ్లు, తరగతి గదులను శానిటైజ్ చేయిస్తున్నారు.
స్కూళ్లు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు భౌతికదూరం పాటించేందుకు వీలుగా బెంచీలకు మధ్య దూరం పాటిస్తూ తరగతి గదిలో 20 మంది ఉండేలా చూస్తున్నారు. భౌతికదూరం పాటించడాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు ఇమ్యూనిటీ పెంచేందుకు మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందించనున్నారు.
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు