హైదరాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల అంశాలపై మంత్రుల నివాస సముదాయంలో గురువారం మంత్రి సమీక్షా సమావేశం ద్వారా చర్చించారు. ఈ సమీక్షలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సహకారశాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య, టెస్కాబ్ ఎండీ మురళీధర్ పాల్గొన్నారు.